Showing posts with label Unknown facts about puri jagannath temple. Show all posts
Showing posts with label Unknown facts about puri jagannath temple. Show all posts
మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథస్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పేరుగాంచిన క్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాధ, బలభద్ర, సుభద్ర స్వామివారు కొలువై ఉన్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పూరి శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుంది

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది పూరిజగన్నాథుని ఆలయం. ఈ ఆలయంపై జెండా ఎప్పుడూ గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుందట.

చరిత్ర

ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ నిర్మితమైందో ఆధారాలు లేకపోయినప్పటికీ గంగదేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో నిర్మించాడని శాసనాల ద్వారా అవగతమవుతుంది.

మీవైపే చూస్తున్నట్లు

ఈ ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం మీరు పూరి పట్టణంలో ఎక్కడినుండి చూసినా మీవైపే చూస్తున్నట్లు ఉంటుంది.

లోపల 120 ఆలయాలు

ఈ ఆలయ సమూహం నాలుగులక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూ ఎత్తైన ప్రాకారం కలిగి ఉంటుంది. లోపల 120 వరకు ఆలయాలు ఉన్నాయి.

మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి

భారతదేశంలో 7 మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి. మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది సాయంకాలం దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ పూరిలో మాత్రం పూర్తి విరుద్దంగా ఉంటుందట.

ఆలయం మీద వెళ్ళవు

పక్షులు, విమానాలు ఆలయం మీద వెళ్ళవు.

నీడ ఏ సమయంలోనైనా కన్పించదు

ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా సరే ఏ దిశలోనూ అస్సలు కన్పించదు.

20 లక్షల మందికి పెట్టవచ్చు

పూరి జగన్నాథుని ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని సుమారు 20 లక్షల మందికి పెట్టవచ్చు. అయినా సరే ఆ ప్రసాదం వృధా అవ్వదు, తక్కువకూడా అవ్వదు.

ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది

పూరి జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పుమీద 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరి ఒకటి పెట్టి వంట చేస్తారు. అయితే సాదారణంగా కింద ఉండే పాత్ర వేడవుతుంది. కాని విచిత్రంగా ఇక్కడ మాత్రం ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది ఆ తరువాత కింద పాత్ర వేడెక్కుతుంది.

సముద్రం శబ్ధం వినపడదట

ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేస్తే సముద్రం శబ్ధం వినపడదట. అదే ఒక అడుగు వెనక్కివేస్తే శబ్ధం వినిపిస్తుందట.