రంగులు మార్చే వినాయకుడిని చూసారా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ సైట్లలో కూడా అవును నిజమే అంటూ కధనాలు వస్తున్నాయి. వినడానికి విచిత్రం గా ఉన్నా నిజం గా రంగులు మార్చే వినాయకుడి ఆలయం తమిళనాడు లోని నాగర్కోయిల్ జిల్లా కేరళపురం గ్రామంలో ఉందట.
1. ఈ వినాయకుడి విగ్రహం రంగు ఆరు నెలలకు ఒకసారి మారుతుందట. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
2. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమే అని భక్తులు అంటారు.
3. దీన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా చిత్రాలు చాలా ఉన్నాయి.
4. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన సంగతే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ. ఇక్కడ మాత్రం అది చెల్లదు అంటుంది ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయట.
5. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉందని అంటున్నారు. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.
6. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
7. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉందట. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారని చెబుతారు.
8. ఈ ఆలయం 1317 సంవత్సరంలో నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా.
9. నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
10. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించారు.
11. ఇక ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.
1. ఈ వినాయకుడి విగ్రహం రంగు ఆరు నెలలకు ఒకసారి మారుతుందట. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
2. దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమే అని భక్తులు అంటారు.
3. దీన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా చిత్రాలు చాలా ఉన్నాయి.
4. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన సంగతే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ. ఇక్కడ మాత్రం అది చెల్లదు అంటుంది ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయట.
5. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉందని అంటున్నారు. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.
6. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
7. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉందట. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారని చెబుతారు.
8. ఈ ఆలయం 1317 సంవత్సరంలో నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా.
9. నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
10. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించారు.
11. ఇక ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.
0 comments:
Post a Comment