పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి క్రీ.శ 1608 లో కాశీ పట్టణంలో జన్మించారు. ఇతడు 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘసంస్కర్త కూడా. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచం లో ఏం జరిగినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అని అంటూ ఉంటారు జనాలు. ఆయన చెప్పిన సంఘటనలు పొల్లుపోకుండా అన్ని జరగుతూ వస్తున్నాయి. బ్రహ్మంగారు సాక్షాత్తు దైవస్వరూపులు. ఈయన మొదటి జ్ఞాన బోధ తల్లితో ప్రారంభించాడు. ఆమెకు జ్ఞాన బోధ చేసి దేశాటనకు బయలుదేరాడు. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటివరకూ జరిగినవి.
1. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు. నీటిని ఉపయోగించి జనరేటర్స్ తయారు చేస్తున్నారు.
2. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. ఒకప్పుడు జంతువులను ఉపయోగించి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు యాత్ర వాహనాలను ఉపయోగిస్తున్నాం.
3. కాశీ పట్నం 40 రోజులపాటు పాడుబడుతుంది.
4. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ గురించి తెలియజేసారు..
8. కృష్ణ గోదావరి నదుల మధ్య రక్తం ఏరులై పారుతుంది.
19. కంచి, శృంగేరి, పుష్పగిరిలో అనేక వింతలు పుట్టును ఆ పీఠములకు గట్టు కాలము పీఠాధిపత్యములు తిరిగి విశ్వ బ్రహ్మణులకు చేరునని బ్రహ్మంగారు చెప్పెను.
20. శ్రీ శైలంలో పరుసవేది దొరికి తిరిగి బ్రహ్మంగారి మతం చేరుతుంది అని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తెలిపారు.
21. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది అని కాలజ్ఞానంలో చెప్పబడింది.
22. శ్రీశైల మల్లిఖార్జున గుడిలో పొగ, మంట వచ్చును. మల్లిఖార్జునుడు సాక్షాత్కారమయి ప్రజలతో మాట్లాడును. శ్రీశైల బ్రమరాంబ గుడిలో ఒక ముసలి వచ్చి 8 దినములు ఉండి మేకపోతువలె అరచి మాయమవును. శివుని కంట నీరు కారును, బసవేశ్వరుడు రంకి వేసి కాలుదువ్వును. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పబడింది.
23. పుట్ల కంబము మీద ప్రతిమ మాట్లాడును కాలభైరవుడు మంత్రములు చదవును. అని బ్రహ్మం గారు చెప్పారు.
24. శ్రీ స్వామివారి సైన్యం కోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహల నుండి వస్తాయి.
25. కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశదొరలు ప్రజలు నష్టమవుతారు. రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్దం సంభవిస్తుందని బ్రహ్మం గారు చెప్పారు.
26. గుళ్ళలో దేవుళ్లుకు మూర్తిమంతములు వచ్చి ఊరురా నాట్యమాడును కంచి కామాక్షి గిర్రున తిరుగును.... బిళం కామాక్షమ్మ కండలు కక్కును గండకి నదిలో సాలగ్రాములు నాట్యమాడును. వినాయకుడు వలావలా ఏడ్చును. దేవతలు ప్రజలతో మాట్లాడును. కాలజ్ఞానం లో ఈ విధంగా చెప్పారు.
27. వినాయకుడు ఊరూరా తిరిగి వేద మంత్రములను చదువును. తామే వీరభోగవసంతరాయులమని చాలామంది దొంగ సాధువులు వస్తారని ఆయన తెలిపారు.
28. కృష్ణానది వరదలలో ఆనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు దుర్గమ్మ ముక్కు పోగు అంటుతుంది.
29. భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయిపల్లె విలసిల్లుతుందని ఆయన పలికారు.
30. కంచికి పడమట కామ ధేనువు జన్మింస్తుందని నవ నారశింహక్షేత్రాలు, యాగంటి, అలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలో ఉన్నమహా విధులను తిప్పారు అని బ్రహ్మం వాక్కు.
31. బాపల పంచాగము తలక్రిందులవును వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోవును అని బ్రహ్మం గారు అన్నారు.
32. పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్కనీరు ఉండదు. 13న రోజు భయంకరమైన వరదలు వస్తాయి.
33. గోపురము కూలి కుంభుని కుంభకోణం రూపుమారుతుంది. క్షిపణి అణుదాడితో హంపి దెబ్బతింటుంది. మాయజంగాలు వస్తారు. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పబడ్డారు.
34. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమణముగల మనుషులు పుడతారు. అని కాలజ్ఞానం చెప్తుంది.
35. ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి. ఐదేళ్ళ నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు భవిష్యత్తు చెపుతాడు.
36. వెంకటేశ్వరుని కుడి భుజము అదురును తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి.
37. గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒకఆవు మనిషికి జన్మనిస్తుంది. పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది. అని కాలజ్ఞానంలో చెప్పబడింది.
38. రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులవుతారని బ్రహ్మం పలికారు.
39. అహాబిలంలో ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూయును. మూడవ ప్రపంచయుద్దం ముగిసే నాటికి 7 ఊర్లకు 1 ఊరు మిగులుతుంది.
40. కొండ పగిలి నిలువ నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లాయ పల్లె చేరుతుంది.
వీరబ్రహ్మంగారు తిరిగి జన్మించి రాబోయేముందు జరుగుకొన్ని సంఘటనలు.
41. కలియుగ 5000 సంవత్సరాలు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్ధం బ్రహ్మంగారు ఉద్భవిస్తారు.
42. ఉప్పుకోటారులో ఊరచెరువులో ఉత్సవాలు పుడతాయి. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచుతాయి. ఇదే శ్రీస్వామి వారు రావటానికి నిదర్శనం.
43. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
44. 5972 ధాతు నామసంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కొటొదూపాటితో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది.
45. కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో భేరీకోమటి మహాత్ముడై నిలుస్తాడు.
46. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పులవాన కురుస్తుంది.
47. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది. బనగానపల్లెలో కాలజ్ఞానం పాతరపై ఉన్న వేపచెట్టుకు చేమంతి పూలు పూస్తాయి.
48. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుండి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
0 comments:
Post a Comment