ఇవి మీకు తెలుసా ?

ప్రపంచలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. అలాంటి కొన్ని మనకు తెలియని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇవి మీకు తెలుసా ?

  • ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి  అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ అంట . 1920 సంత్సరంలో ఎన్నో బ్యాంకులో దొంగతనం చేసి దొంగతనం చేసిన ప్రతి బ్యాంకు లో ఎంతో మంది పేదలకి సంబంధించిన రుణ పత్రాలని కాల్చేసేవాడు. అలా  ఒక దొంగ ఐనా ఆరోజుల్లోనే ఎంతోమందికి రుణ మాఫీ చేసాడు. అందుకే ఇతని అంతక్రియలలో కొన్ని వేళ మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారంట. నిజంగా మంచి దొంగ కదా !
  • ప్రపంచంలోనే ఎక్కువుగా అమ్ముడు అయ్యే బిస్కట్ ఏంటో తెలుసా పార్లే జి . ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమరుగుగా 48,00,00,000 కోట్ల పార్లే జి బిస్కట్ ప్యాకెట్లు అమ్ముడు అవుతున్నాయట.
  • ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాల లోని పోర్ట్ ల్యాండ్ అనే ప్రాంతం లో ఉంది.ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుందట. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ గా ఇది గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కింది.
  • ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే ఆపిల్ గింజలో కూడా ఉంటుందట. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల  మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లి గ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది.ఒక ఆపిల్ గింజలో 0.49 mg సైనైడ్ ఉంటుంది.అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున ఒకటి రెండు గింజలు తిన్నాకూడా మనకి ఏమి కాదు.
  • ఆడ కంగారూలు ఒకేసారి రెండు పిల్లలకు రెండు స్తనాల నుంచి రెండు రకాల పాలివ్వగలవట. పుట్టి నెలల వయసున్న కంగారూకు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే పాలిస్తుందంట. అదే సమయం లో మరో కంగారూ పుడితే దానికి కొవ్వు పదార్ధాలు ఎక్కువ గా ఉండే పాలిస్తుంది. అంటే…ఒకేసారి రెండు పిల్లలకు రెండు రకాల పాలన్నమాట.
  • ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్‌బే. అక్కడ గాలి గంటకు 150 మైళ్ళ వేగంతో వీస్తుంది
  • స్వీడన్ లో ఐస్ తో నిర్మించబడిన హోటల్ ఉంటుంది. సీజన్ మారుతున్నప్పుడు ఈ హోటల్ కరిగిపోతుంది,అందుకే ఈ హోటల్ ను ప్రతి ఏటా నిర్మిస్తూనే ఉంటారు.
  • స్ట్రాబెరీలలోకన్నా నిమ్మకాయల్లో చక్కెర శాతం ఎక్కువ.
  • ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండు రెట్లు పొడవుగా ఉంటుంది.
  •  ఒకే పరిమాణం లో ఉన్న ఇనుప గొట్టం, మనిషి ఎముకలను పరీక్షిస్తే మనిషి ఎముకే బలమైనదని తేలింది.
  •  ఏ రెండు జీబ్రాల వంటి మీది గీతలు….ఒకేలా ఉండవు.
  • చీమలకు సుద్దపొడి గిట్టదు. అందుకే సుద్దముక్కతో గీసిన గీతాలను అవి దాటలేవు.
  • మనకు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒక్కోమాట ఎంత ఆలోచించిన తట్టదు…ఈ స్థితిని lethologica అని అంటారట.

0 comments:

Post a Comment